prabhas: అబుదాబికి 'సాహో' టీమ్ .. అత్యంత భారీ సన్నివేశాల చిత్రీకరణ

  • అబుదాబిలో 45 రోజుల షూటింగ్ 
  • భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • 40 శాతం బడ్జెట్ కేటాయింపు

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై .. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకూ పూర్తయింది. మేజర్ షెడ్యూల్ ను 'అబుదాబి'లో ప్లాన్ చేసి చాలాకాలమే అయింది. అయితే కొన్ని కారణాల వలన ఈ షెడ్యూల్ వాయిదాపడుతూ వచ్చింది. ఇక అబుదాబి షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరిందనేది తాజా సమాచారం.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 'కెన్నీ బేట్స్' డిజైన్ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. 45 రోజుల పాటు ఏకధాటిగా అక్కడ షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమా బడ్జెట్ లో 40 శాతాన్ని ఈ షెడ్యూల్లో ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతోన్న ఈ సినిమాలో, ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ కనిపించనున్న సంగతి తెలిసిందే.   

  • Loading...

More Telugu News