Telangana: కోదండరామ్ నేతృత్వంలో కొత్త‌ రాజకీయ పార్టీ.. పేరు ప్రకట‌న‌కు ముహూర్తం ఖరారు!

  • తెలంగాణ జన సమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం?
  • పార్టీ పేరు అధికారికంగా ప్రకటించనున్న కోదండరామ్‌
  • వ‌చ్చేనెల‌ 2న పార్టీ పేరు ప్రకటన

తెలంగాణ‌లో మ‌రో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ ఉద్య‌మ పోరాట యోధుడు, టీజేఏసీ ఛైర్మ‌న్‌ కోదండరామ్ నేతృత్వంలోని ఈ పార్టీకి 'తెలంగాణ జన సమితి' అనే పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. వ‌చ్చేనెల‌ 2న కోదండరామ్ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి అధికారికంగా పార్టీ పేరు ప్రకటించి, త‌మ విధి విధానాల‌ను ప్ర‌క‌టించ‌నున్నట్లు సమాచారం. ఈ బ‌హిరంగ స‌భ హైద‌రాబాద్ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్‌ స్టేడియంలలో ఏదైనా ఒకచోట ఉంటుంద‌ని తెలిసింది. ఇందుకోసం ఇప్ప‌టికే కోదండ‌రామ్ పోలీసుల అనుమతి కోరారు. కోదండ‌రామ్ పార్టీ జెండా, ఎజెండాల‌ను అదే రోజున ప్ర‌క‌టించ‌నున్నారు.

More Telugu News