jagan: జగన్ పర్యటించిన ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన టీడీపీ ఎమ్మెల్యే

  • పెదకూరపాడు నియోజకవర్గంలో ముగిసిన జగన్ పాదయాత్ర
  • జగన్ రాకతో తమ ప్రాంతం మలినమైందన్న టీడీపీ కార్యకర్తలు
  • అందుకే శుద్ధి చేస్తున్నామన్న తెలుగు తమ్ముళ్లు

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగిసింది. తన పాదయాత్ర సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై జగన్ విమర్శల వర్షం కురిపించారు. జగన్ విమర్శలపై శ్రీధర్ కూడా స్పందించారు. తాను అవినీతికి పాల్పడినట్టు జగన్ నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో, తన నియోజకవర్గంలో జగన్ పర్యటించిన ప్రాంతాలను టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. జగన్ పర్యటనతో తమ ప్రాంతం మలినమైపోయిందని... అందుకే శుద్ధి చేస్తున్నామని తెలిపారు.

More Telugu News