nayanatara: ఆ సినిమాలో నటించినంత మాత్రాన నన్ను బాధ్యురాలిని చేస్తారా?: నయనతార

  • నయన్ కొత్త సినిమా విడుదలపై ఆగ్రహం
  • ఇంటిని ముట్టడిస్తామన్న ఓ వర్గ ఎమ్మెల్యేలు
  • సినిమా విడుదలకు, తనకు ఏం సంబంధమన్న నయన్

'పుదియ నియమమ్' అనే మలయాళ చిత్రంలో నయనతార నటించింది. ఆ సినిమాను 'వాసుకి' పేరుతో తమిళంలోకి అనువదించారు. నిన్న తమిళనాట ఆ చిత్రం విడుదలైంది. అయితే, కొత్త సినిమాలు విడుదల చేయకూడదని నిర్ణయించి కోలీవుడ్ లో బంద్ పాటిస్తున్నారు. ఇదే సమయంలో 'వాసుకి' విడుదల కావడంతో ఓ వర్గం నిర్మాతలు మండిపడ్డారు.

నయనతారకు మాత్రం ఈ ప్రత్యేకత ఎందుకని వారు ప్రశ్నించారు. చెన్నైలో ఉన్న నయన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నయనతార స్పందిస్తూ... ఈ సినిమా విడుదలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తమిళంలో ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తున్నారో కూడా తనకు తెలియదని చెప్పారు. కేవలం ఆ సినిమాలో నటించినందుకు తనను బాధ్యురాలిగా చేయడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News