Andhra Pradesh: ఏపీలో దుష్టచతుష్టయం తయారైంది: తులసిరెడ్డి

  • టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు దుష్టచుతష్టయం
  • ఈ నాలుగు పార్టీలు  ప్రజలను మోసం చేశాయి
  • ‘తప్పు నీదంటే నీదంటూ’ రాజకీయ డ్రామాలాడుతున్నాయి
  • ఏపీకి మళ్లీ అన్యాయం చేయాలని చూస్తున్నాయి

ఏపీలో దుష్టచతుష్టయం తయారైందంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నాలుగు పార్టీలు  ప్రజలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి 5 లక్షల కోట్ల ప్రయోజనాలిచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు.

 ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, ఆ ఆగ్రహం తమపై పడకుండా ఉండేందుకు రాజకీయ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘తప్పు నీదంటే నీదంటూ’ ఈ నాలుగు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఏపీకి ఈ నాలుగేళ్లు చేసిన అన్యాయం చాలక, మళ్లీ అన్యాయం చేయాలని చూస్తున్నాయని తులసి రెడ్డి ఆరోపించారు.

More Telugu News