mohan babu: యూట్యూబ్ లో దూసుకుపోతోన్న 'గాయత్రి'

  • మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'గాయత్రి'
  • యూట్యూబ్ లో కొనసాగుతోన్న జోరు 
  • పది రోజుల్లో 15 లక్షల వ్యూస్      

చాలా గ్యాప్ తరువాత మోహన్ బాబు చేసిన సినిమా 'గాయత్రి'. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. మోహన్ బాబు ద్విపాత్రాభినయం .. ఆయన డిఫరెంట్ లుక్స్ ఈ సినిమాపై మరింతగా కుతూహలాన్ని పెంచాయి. ఇక మంచు విష్ణు .. శ్రియ జంట ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వచ్చింది.

అయితే ఏ కారణం చేతనో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా కంటెంట్ పై గల నమ్మకంతో, 50 రోజులు కూడా పూర్తికాకముందే మంచు విష్ణు అధికారిక యూట్యూబ్ ఛానల్లో అప్ లోడ్ చేశారు. యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 10 రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను 15 లక్షల మంది వీక్షించడం విశేషం. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఎక్కువమంది వీక్షించిన సినిమాల జాబితాలో 'గాయత్రి' కూడా చేరిపోయింది.     

More Telugu News