పవన్ కల్యాణ్పై లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విమర్శలు
- జేఎఫ్సీపై పవన్ కల్యాణ్ మొదట శ్రద్ధ చూపారు
- ఇప్పుడు పట్టించుకోవడం లేదు
- జేఎఫ్సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు లేవు
- అందుకే నేను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాను
ఈ సమావేశం ముగిసిన అనంతరం జేపీ మీడియాతో మాట్లాడుతూ... సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్సీ) పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదట శ్రద్ధ చూపించి తరువాత పట్టించుకోవడం లేదని అన్నారు. జేఎఫ్సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని తెలిపారు. జేఎఫ్సీ తొలిదశ అయితే, స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అని వ్యాఖ్యానించారు. తాము చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని తెలిపారు.