redmi tv 4s: రెడ్ మీ ఎంఐ టీవీ 4ఎస్ కేవలం రూ.31,000కే... చైనాలో విడుదల

  • త్వరలో భారత మార్కెట్లోకి 
  • అధిక స్టోరేజీ సామర్థ్యం
  • వాయిస్ కమాండ్స్ ఫీచర్

చైనా కంపెనీ షియోమీ కొత్త ఉత్పాదనల ఆవిష్కరణలో వేగాన్ని పెంచింది. ఈ సంస్థ తాజాగా 55 అంగుళాల పరిమాణంతో 4కే డిస్ ప్లే కలిగిన 4ఎస్ మోడల్ ను తన మాతృదేశంలో విడుదల చేసింది. దీని ధర 2,999 యువాన్లు. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.31,000. భారత్ లో నూ ఈ సంస్థ ఎంఐ టీవీ సిరీస్ లో 4, 4ఏ మోడళ్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే 4ఎస్ మోడల్ ను కూడా ఇక్కడ విడుదల చేయనుంది.

ఎంఐ 4 టీవీ కూడా 55 అంగుళాలతో 4కే మోడల్ కావడం గమనార్హం. దీన్ని రెడ్ మీ భారత మార్కెట్లో రూ.39,999కు విక్రయిస్తోంది. దీంతో 4ఎస్ టీవీకి ఎంత ధర నిర్ణయిస్తుందన్న ఆసక్తి నెలకొంది. కాకపోతే 4మోడల్ తో పోలిస్తే 4ఎస్ లో స్టోరేజీ సామర్థ్యం అధికంగా ఉంది. 4ఎస్ లో వాయిస్ ఆధారిత కమాండ్స్ ఫీచర్ ను చేర్చింది. 20 నిమిషాల తర్వాత షట్ డౌన్ చేేయాలని చెబితే అది చేసేస్తుంది. 30 నిమిషాలు ఫాస్ట్ ఫార్వాడ్ అని చెప్పినా చేసి చూపిస్తుంది.

More Telugu News