fadnavis: వేదికపై ప్రసంగిస్తుండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి చేదు అనుభవం

  • అన్నా హజారేతో దీక్షను విర‌మింప‌జేసిన ఫడ్నవిస్
  • వేదికపై ఫడ్నవిస్ మాట్లాడుతుండగా షూ విసిరిన ఓ వ్యక్తి
  • కెమెరాకు చిక్కిన దృశ్యాలు

అవినీతి నిర్మూలన కోసం సమర్థవంతమైన లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని, అలాగే, రైతుల హక్కులు కాపాడాలని ఢిల్లీలో దీక్ష చేస్తోన్న‌ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో మాట్లాడిన‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. దీక్షను విర‌మింప‌జేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై ఫడ్నవిస్ మాట్లాడుతుండ‌గా ఆయ‌నకు చేదు అనుభ‌వం ఎదురైంది.

కేంద్రంలో లోక్‌పాల్‌, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున ఫడ్నవిస్ చెబుతుండ‌గా, అక్క‌డ ఉన్న వారి లోంచి ఓ వ్యక్తి ఫ‌డ్న‌విస్ పైకి షూ విసరడంతో అది ఆయనకు కుడివైపున కూర్చున్న వారిపై ప‌డింది. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారా? అనే అంశంపై వివరాలు తెలియాల్సి ఉంది.   

More Telugu News