samantha: మియామీలో విహార యాత్రకు వెళ్లిన శామ్-చై దంపతులు

  • అమెరికాలోని మియామీలో విహరిస్తున్న శామ్-చై
  • విన్ వుడ్ లో దిగిన ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన సమంత
  • షూటింగ్స్ పూర్తి చేసుకుని విహారయాత్రకు వెళ్లిన సమంత దంపతులు

‘రంగస్థలం’, ‘మహానటి’, ‘సవ్యసాచి’ సినిమాల షూటింగ్స్‌ ముగించిన టాలీవుడ్ దంపతులు అక్కినేని నాగచైతన్య, సమంత విదేశీ విహారయాత్రలో ఉన్నారు. అమెరికాలోని మియామీలో ఈ జంట సేదదీరుతోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత తమ టూర్ విషయాన్ని వెల్లడిస్తూ, కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ నెల 19న వారు ఈ టూర్ కి వెళ్లారు.

తాజాగా, తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో మియామీలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన విన్‌ వుడ్‌ లో భర్తతో దిగిన ఫోటోను శామ్ పంచుకుంది. విన్ వుడ్ అవుట్ డోర్ మ్యూజియం, అక్కడ ప్రపంచంలోనే ఉత్తమమైన కళాకారుల చిత్రాలను ప్రదర్శిస్తారు.  సమంత ‘రంగస్థలం’ మార్చి 30న విడుదల కానుండగా, మరోసినిమా ‘మహానటి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చైతన్య ‘సవ్యసాచి’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 

More Telugu News