MLA: ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెండు కేసుల నమోదు

  • శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ చేసిన ప్రసంగం వీడియో వైరల్
  • మనోభావాలు దెబ్బతీశాడంటూ పోలీసులకు ఫిర్యాదులు 
  • సెక్షన్ 295 ఏ కింద కేసుల నమోదు 

హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ ఉద్రేకపూరితంగా ప్రసంగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక మతాన్ని కించపరిచేలా, మతసామరస్యాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించి వారి మనోభావాలు దెబ్బ తీశాడంటూ మీర్ చౌక్ డివిజన్ లోని రెండు పోలీస్ స్టేషన్లలో పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు సెక్షన్ 295 ఏ కింద కేసులు నమోదు చేశారు.

More Telugu News