rangastalam: 'జిగేలు రాణి' పాట ప్రోమో చూసి మా బామ్మ డాన్స్ ఆపడం లేదు: పూజ హెగ్డే

  • రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జిగేలు రాణి..’ పాట ప్రోమోను విడుదల చేసిన ‘రంగస్థలం’ చిత్ర యూనిట్
  • మార్చి 30న విడుదలకు సిద్ధమైన ‘రంగస్థలం’
  • ఈ పాటకు తన బామ్మ ఆసుపత్రిలో స్టెప్పులేస్తోందంటూ వీడియో పోస్టు చేసిన పూజ హెగ్డే

 ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ తో చేసిన ఐటెం సాంగ్ తన బామ్మ(83) లో కొత్త ఉత్సాహం తెచ్చిందని పూజ హెగ్డే చెబుతోంది. మార్చి 30న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలోని ‘జిగేలు రాణి..’ పాట ప్రోమోను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రోమోను చూసిన తన బామ్మ ఆసుపత్రిలో చిందులేస్తున్నారని ఈ పాటకు నర్తించిన జిగేలు రాణి ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఈ సందర్భంగా తన బామ్మ హుషారుగా డాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేస్తూ, ‘గత కొన్ని రోజులుగా మా బామ్మ ఆసుపత్రిలో ఉన్నారు. నేను నటించిన ‘జిగేలు రాణి’ పాట ప్రోమోను చూసిన తర్వాత ఆమె చాలా సంతోషించారు. పైకి లేచి, డ్యాన్స్‌ చేస్తున్నారు. ఈ పాట ఆమెలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపినట్లు ఉంది. ఆమె పాట పాడటం ఆపడమే లేదు’ అంటూ దేవిశ్రీ ప్రసాద్‌ కు ట్వీట్‌ ను ట్యాగ్‌ చేశారు.

More Telugu News