Vijay Sai Reddy: వైసీపీ పగలు సంసారం, రాత్రి రాజకీయ వ్యభిచారం చేస్తోంది: ధూళిపాళ్ల నరేంద్ర

  • విజయసాయిరెడ్డి చీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు
  • రాజ్యసభకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు
  • మోదీ కాళ్లకు మొక్కడం ద్వారా అసలు నైజాన్ని చాటుకున్నారు

వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పగలు సంసారం చేస్తూ, రాత్రి రాజకీయ వ్యభిచారం చేయడం ఆ పార్టీ నేతల నైజమని ఆయన విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయి... ఆ సభకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంస్కార హీనంగా మాట్లాడుతూ, రాజ్యసభ గౌరవాన్ని దిగజార్చుతున్నారని అన్నారు. ప్రధాని కాళ్లకు మొక్కడం ద్వారా ఆయన తన అసలు నైజాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News