nitin: నితిన్,రాశిఖన్నా జోడీ భలే కుదిరింది .. 'శ్రీనివాస కల్యాణం' రిలీజ్ డేట్ ఖరారు

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
  • నితిన్ సరసన రాశి ఖన్నా
  • జూలై 24వ తేదీన విడుదల

తెలుగు తెరపై యువ కథానాయకులందరూ ఒకరికొకరు గట్టిపోటీగానే నిలుస్తున్నారు. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూనే ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నారు. అలాంటి యంగ్ హీరోల జాబితాలో నితిన్ ముందు వరుసలో కనిపిస్తాడు. వచ్చేనెల 5వ తేదీన 'ఛల్ మోహన్ రంగ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న నితిన్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా దర్శకుడు సతీశ్ వేగేశ్నతో 'శ్రీనివాస కల్యాణం' చేస్తున్నాడు.

 దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. వచ్చేనెల 17వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ చండీఘర్ లో జరగనుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను, జూలై 24వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.    

More Telugu News