allu arjun: 'రచ్చ' దర్శకుడి వైపు మొగ్గుచూపుతోన్న అల్లు అర్జున్!

  • 'నా పేరు సూర్య'తో బిజీగా బన్నీ 
  • తరువాత మూవీ సుకుమార్ తో అంటూ టాక్ 
  • సంపత్ నందితో ప్రాజక్టు 

ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చేస్తున్నాడు. మే 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో చేయవచ్చనే ఆసక్తి అభిమానుల్లో వుంది. సుకుమార్ తో ఉండవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 తాజాగా సంపత్ నంది పేరు తెరపైకి వచ్చింది. గతంలో 'రచ్చ' సినిమాతో చరణ్ ఫాన్స్ ను ఆకట్టుకున్న సంపత్ నంది, ఆ తరువాత 'బెంగాల్ టైగర్'తోను తన మార్క్ చూపించాడు. ఇక రీసెంట్ గా మాత్రం 'గౌతమ్ నంద'తో ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఇటీవల ఆయన ఒక కథ వినిపించడంతో, బాగుందంటూ అల్లు అర్జున్ ఆ వైపు మొగ్గుచూపుతున్నాడట. ఈ సినిమాకి నిర్మాతగా సి.కల్యాణ్ వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. మరి ముందుగా బన్నీ.. సుకుమార్ తో సెట్స్ పైకి వెళతాడా? లేదంటే సంపత్ నందికి ఛాన్స్ ఇస్తాడా? అనేది చూడాలి.        

More Telugu News