Krishna District: టోల్ ప్లాజా ఉద్యోగుల హెచ్చరికలతో కీసర వద్ద తప్పిన పెను ప్రమాదం

  • ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మంటలు
  • గమనించి అలర్ట్ చేసిన ఉద్యోగులు
  • 40 మంది సేఫ్

ఈ ఉదయం కృష్ణా జిల్లా కీసర వద్ద టోల్ ప్లాజా ఉద్యోగులు చేసిన హెచ్చరికలతో పెను ప్రమాదం తప్పింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, టోల్ ప్లాజా నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దాటుతున్న సమయంలో బస్సు టైర్లకు మంటలు అంటుకుని ఉన్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేయాలని పెట్రోలింగ్ సిబ్బందిని వారు అప్రమత్తం చేయడంతో ప్రయాణిస్తున్న బస్సును వారు అడ్డగించారు. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ముంబై నుంచి విజయవాడ వస్తుండగా, బస్సును ఆపిన కాసేపటికే రెండు టైర్లు పూర్తిగా దహనమయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News