TRS: మా బాసే ప్రధాని కావచ్చు: టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • 2019లో ఏమైనా జరగవచ్చు
  • బీజేపీతో పొత్తయినా ఏమైనా సరే
  • వేచి చూస్తే తెలుస్తుందన్న జితేందర్ రెడ్డి

2019 ఎన్నికల తరువాత తమ బాస్ కేసీఆర్ ప్రధానమంత్రి అయి, దేశాన్ని తామే లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏదైనా జరగవచ్చని అన్నారు. "బీజేపీతో పోస్ట్ అలయన్స్ కావచ్చు... మా బాసే ప్రధానమంత్రి కావచ్చు... మేమే లీడ్ చేయవచ్చు... ఏదైనా కావచ్చు ఆ రోజు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ వాటీజ్ హ్యాపెనింగ్" అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిందని వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. కేసీఆర్ అధినాయకత్వంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉందని తెలిపారు.

More Telugu News