Nizamabad District: నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. అదుపు తప్పి బావిలో పడ్డ ఆటో.. 8 మంది మృతి

  • ముప్కాల్ నుంచి మెండోరాకు వెళ్తుండగా సంఘటన
  • క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీసిన ఫైర్ సిబ్బంది
  • మృతదేహాల వెలికితీత

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్కాల్ నుంచి మెండోరాకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.

క్రేన్ సాయంతో బావిలో పడ్డ ఆటోను బయటకు తీశారు. బావిలో నుంచి 8 మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాద సంఘటనలో మరికొంత మంది ప్రయాణికులను స్థానికులు, పోలీసులు రక్షించారు. కాగా, ఆటోలో మొత్తం పద్నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల సమాచారం.  

More Telugu News