raj tarun: 'కుమారి 21 F' దర్శకుడితో రాజ్ తరుణ్

  • రాజ్ తరుణ్ తో సూర్యప్రతాప్ 
  • నిర్మాతగా రామ్ తాళ్లూరి 
  • వచ్చేనెల 18వ తేదీన లాంచ్  

రాజ్ తరుణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'కుమారి 21 F' ఒకటిగా కనిపిస్తుంది' సుకుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి సూర్యప్రతాప్ దర్శకుడిగా వ్యవహరించాడు. యూత్ లోకి ఒక రేంజ్ లో ఈ సినిమా దూసుకుపోయింది. ఇప్పుడు అదే దర్శకుడితో రాజ్ తరుణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

 రాజ్ తరుణ్ కోసం విభిన్నమైన కంటెంట్ ను సూర్యప్రతాప్ సిద్ధం చేసుకోగా, రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారట. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. వచ్చేనెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారట. ప్రస్తుతానికి కథానాయిక విషయంలో అన్వేషణ సాగుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.  

More Telugu News