somu viraraju: ప్రత్యేక హోదా కింద 16 వేల కోట్లు ఇవ్వనున్నాం: సోము వీర్రాజు

  • రూ.16,000 కోట్లను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
  • ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని కోరాం
  • టీడీపీ ప్రభుత్వానికి ఇస్తే దారి మళ్లించే ప్రమాదం ఉంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక హోదా కింద రూ.16,000 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఆయన చెప్పారు. అయితే, ఈ నిధులు విడుదల చేసేందుకు గాను ఓ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సోము వీర్రాజు చెప్పారు.

లేకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా టీడీపీ ప్రభుత్వానికి ఇస్తే వాటిని దారి మళ్లించే ప్రమాదం ఉందన్నారు. ఓ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తే దానికి జవాబుదారీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

More Telugu News