cuple: 'నీతో నాకీ జీవితం వద్దు.. ఎక్కడున్నా సంతోషంగా ఉండు' అంటూ లేఖ రాసి అదృశ్యమైన వివాహిత

  • లేఖ రాసి అదృశ్యమైన సరిత
  • భార్య కోసం గాలించగా దొరికిన లేఖ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

'నీతో నాకీ జీవితం వద్దు...ఎక్కడున్నా సంతోషంగా ఉండు' అంటూ భర్తకు లేఖ రాసి వివాహిత అదృశ్యమైన సంఘటన హైదరాబాదు సమీపంలోని రాయదుర్గంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... రాయదుర్గంలో ప్రైవేటు ఉద్యోగి సీహెచ్‌.రాజు, భార్య శారద అలియాస్ సరిత (23) తో కలిసి ఉంటున్నాడు. ఈనెల 21న సరిత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది. ఆ తరువాత తిరిగి రాలేదు.

దీంతో ఆమె కోసం గాలించగా, ఇంట్లోనే ఓ లేఖ దొరికింది. ‘నీతో నాకు ఈ జీవితం ఇక వద్దు. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉండు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. నేను ఎటు వెళ్తానో, నా గమ్యం ఏమిటో నాకే తెలియదు.’ అంటూ ఆ లేఖలో ఆమె రాసింది. దీంతో వివిధ ప్రాంతాల్లో గాలించిన భర్తకు ఆమె జాడ తెలియకపోవడంతో రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News