adivi shesh: రాజశేఖర్ కూతురు శివాని మూవీ లాంచ్ రేపే!

  • '2 స్టేట్స్' రీమేక్ లో శివాని 
  • దర్శకుడిగా వెంకట్ కుంచ
  • శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ

జీవిత .. రాజశేఖర్ దంపతుల కుమార్తె 'శివాని' హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సరైన కథ దొరికితే శివానిని వెండితెరకి పరిచయం చేస్తామని జీవిత .. రాజశేఖర్ లు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే హిందీలో హిట్ కొట్టిన '2 స్టేట్స్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శివానిని ఎంపిక చేసుకున్నారు.

అడివి శేష్ ప్రధానమైన పాత్రను పోషించే ఈ సినిమా ద్వారా వెంకట్ కుంచ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో రేపు ఉదయం 8 గంటలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, 8.36 నిమిషాలకి షూటింగును మొదలుపెట్టనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో శివాని తల్లి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ నటించనుండటం విశేషం.  

More Telugu News