somu veerraju: సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారు: పయ్యావుల కేశవ్

  • చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది ముంపు మండలాల కోసమే
  • రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది చంద్రబాబు వల్లే
  • వీర్రాజుకు పయ్యావుల కౌంటర్
ఏపీ శాసనమండలిలో ఈరోజు టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత బీజేపీదే అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను పయ్యావుల ఖండించారు.

సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది ముంపు మండలాల కోసమేనని అన్నారు. తాము స్లిప్పుల ద్వారా పంపిన అంశాలనే ఆనాడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో మాట్లాడారని తెలిపారు. ఈ విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలని సూచించారు. రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ కేంద్రం వల్ల రాలేదని, చంద్రబాబు వల్లే వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, తాను మాట్లాడే ప్రతి సారి అడ్డు తగలడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
somu veerraju
Payyavula Keshav
polavaram
Chandrababu

More Telugu News