ఏపీకి షాక్.. నిధుల్లో మరో కోత విధించిన కేంద్ర ప్రభుత్వం

  • పోలవరంకు నాబార్డు నుంచి రూ. 1400 కోట్లు తీసుకునేందుకు అనుమతించిన కేంద్రం
  • రెండు రోజుల్లోనే మాట తప్పిన కేంద్ర ప్రభుత్వం
  • రూ. 311 కోట్ల కోత
కేంద్ర ప్రభుత్వం... మరోసారి ఆంధ్ర రాష్ట్రానికి ఝలక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిధుల్లో రూ. 311 కోట్ల కోత విధించింది. నాబార్డు నుంచి రూ. 1400 కోట్లు తీసుకునేందుకు కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చింది. రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని నిధుల్లో కోత విధించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రూ. 1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
Go Back to Shorts
polavaram
funds
cut
Andhra Pradesh

More Telugu News