keerti suresh: షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహానటి' .. కన్నీళ్లు పెట్టుకున్న టీమ్

  • సావిత్రిగా కీర్తి సురేశ్ 
  • భారీ తారాగణంతో భారీతనం 
  • మే 9వ తేదీన భారీ రిలీజ్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో .. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో 'మహానటి' సినిమా రూపొందింది. సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా రానున్న ఈ సినిమా, నిన్నటితో షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ షూటింగుకి గుమ్మడికాయ కొట్టేశారు. యూనిట్ సభ్యులంతా కలిసి .. సావిత్రి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

 యూనిట్ సభ్యులంతా చాలా రోజులుగా ఈ సినిమా చేస్తూ వచ్చారు. అందువలన సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుని వాళ్లు కదిలిపోయారు. అందువలన ఆ సంఘటనలను గుర్తుచేసుకుని .. షూటింగు ముగింపు రోజున అంతా కన్నీళ్లు పెట్టుకున్నారట. భారీ తారాగణంతో .. భారీతనాన్ని సంతరించుకున్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.     

More Telugu News