bjp: నా తండ్రి బీజేపీకి 20 ఏళ్లు సేవ చేశారు... ఆయన్ని కాపాడండి... ప్రధానికి ఓ యువకుడి విన్నపం

  • అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నేత
  • అయినా సాయం చేయడానికి ముందుకు రాని పార్టీ, నేతలు
  • ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ నేత కుమారుడు

20 ఏళ్ల పాటు బీజేపీకి సేవలందించిన కన్న తండ్రి అనారోగ్యంతో మంచం పాలైతే సాయం చేసే వారు లేరంటూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నేరుగా ప్రధాని సాయానికే డిమాండ్ చేశాడు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత మొహమ్మద్ షాజద్ ఖాన్ లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఇంత వరకు ఎవరి నుంచి కూడా సాయం అందలేదని, పార్టీకి 20 ఏళ్ల జీవితాన్ని అంకితం చేసిన తన తండ్రికి సాయం చేయాలని అతని కుమారుడు షాఖిబ్ ఖాన్ బీజేపీని, ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశాడు.

తన తండ్రి లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని అయినా ఇంత వరకూ ఆస్పత్రిలో చేర్పించలేదని తెలిపాడు. శనివారం ఎయిమ్స్ కు వెళ్లగా చేర్చుకోలేదని, లివర్ మార్పిడి చేయాల్సి ఉందని వైద్యులు చెప్పినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు స్పందించి సాయం చేయాలని కోరాడు.

More Telugu News