nagachaitanya: 'సవ్యసాచి'కి హైలైట్ గా నిలవనున్న అంశం అదేనట!

  • సవ్యసాచి'గా చైతూ 
  • ఆయన అక్క పాత్రలో భూమిక 
  • జూన్ 14న విడుదల

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఈ సినిమా ఇతివృత్తం ఏమైవుంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో చైతూ అక్క పాత్రలో భూమిక నటిస్తోంది. ఆమెకి జరిగిన అన్యాయానికి తమ్ముడిగా చైతూ ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన కథాంశమని తెలుస్తోంది. సినిమాకి హైలైట్ గా నిలిచేది కూడా ఈ అంశమేనని అంటున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా మాధవన్ కనిపించనున్నాడు. ఇక రావు రమేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Telugu News