chiranjeevi: 'సైరా' షూటింగుకి నయనతార వచ్చేసింది

  • 'సైరా ' రెండవ షెడ్యూల్ మొదలు 
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • త్వరలో జాయిన్ కానున్న అమితాబ్  

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో అసంతృప్తిగా అనిపించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ కూడా మొదలైపోయింది. ఈ షెడ్యూల్లో నయనతార జాయిన్ అయింది. చిరంజీవి సరసన కథానాయికగా ఆమె ఎంపిక జరిగిందనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను, హైదరాబాద్ - నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా అనిపిస్తాయని అంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో అమితాబ్ జాయిన్ కానున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి

More Telugu News