kolkata: కోల్‌కతాలో కాళీమాతను దర్శించుకుని.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్

  • థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై మ‌మ‌తా బెన‌ర్జీతో చ‌ర్చించేందుకు కోల్‌క‌తా వెళ్లిన కేసీఆర్
  • భేటీ ముగిసిన తరువాత కాళీమాత ఆలయానికి వెళ్లిన సీఎం
  • కాసేపట్లో హైదరాబాద్‌కు

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విష‌య‌మై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో చ‌ర్చించేందుకు కోల్‌క‌తా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమెతో భేటీ ముగిసిన‌ త‌రువాత కాళీమాత ఆలయానికి వెళ్లారు. త‌న వెంట‌ వ‌చ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేత‌లతో క‌లిసి అమ్మవారిని దర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కాసేపట్లో ఆయన కోల్‌కతా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలు దేరనున్నారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విషయంపై కేసీఆర్ త్వరలోనే మరికొందరు నేతలతో చర్చలు జరపనున్నారు.        

More Telugu News