srivishnu: కుర్రాళ్లంతా నాలో తమను చూసుకుంటారు: హీరో శ్రీవిష్ణు

  • డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమా ఇది
  • కథాకథనాలు సహజంగా ఉంటాయి 
  • ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు

హీరో శ్రీవిష్ణు పేరు వినగానే 'అప్పట్లో ఒకడుండేవాడు' .. 'ఉన్నది ఒకటే జిందగీ' .. 'మెంటల్ మదిలో' సినిమాలు గుర్తుకు వస్తాయి. నటన పరంగా ఈ సినిమాలు ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాంటి శ్రీవిష్ణు కథానాయకుడిగా 'నీదీ నాదీ ఒకే కథ' సినిమా రూపొందింది. ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ .. " పెద్దగా చదువబ్బని ఒక కుర్రాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?" అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి కుర్రాడు నాలో తనని చూసుకుంటాడు. అలాగే నా తండ్రి పాత్రలో ప్రతి తండ్రి తనని చూసుకుంటాడు. అంత సహజంగా పాత్రలను .. కథను మలచడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమాలే చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ సినిమా చేశాను. ఈ సినిమా తప్పకుండా నాకు సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.         

  • Loading...

More Telugu News