Telugudesam: తమ ఎంపీలకు విప్ జారీ చేసిన తెలుగుదేశం పార్టీ

  • పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్
  • పార్లమెంటులో టీడీపీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆదేశాలు
  • టీడీపీకి పలు పార్టీల మద్దతు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసి, రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, టీడీపీ ప్రవేశపెడుతోన్న అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీల మద్దతు లభించింది. 

More Telugu News