త్వరలో భారత్కూ 'బికినీ' ఎయిర్లైన్స్ విమాన సేవలు!
- ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో భారత్లో కార్యకలాపాల ప్రారంభం
- న్యూఢిల్లీ నుంచి హోచిమిన్ నగరానికి నేరుగా విమానాలు
- బికినీలు, స్విమ్సూట్లతో వియట్ జెట్ ఎయిర్హోస్టెస్ల సేవలు
- బికినీ కాన్సెప్ట్కు భారత్లో వ్యతిరేకత తప్పదని పరిశీలకుల అభిప్రాయం
ఎయిర్హోస్టెస్ల అసాధారణ యూనిఫాం కారణంగా వియట్ జెట్ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించిన అనతికాలంలోనే విపరీతమైన ఆదరణను చూరగొంది. ఈ కంపెనీ అధినేత ఎన్గుయెన్ వియత్నాంలో మొట్టమొదటి మహిళా కోటీశ్వరురాలిగా అవతరించారంటే దీనికి లభించిన ఆదరణ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ నుంచి హోచిమిన్ నగరానికి నేరుగా విమాన సర్వీసులను నడుపుతామని కంపెనీ ప్రకటించింది. ఈ విమానాలు వారంలో నాలుగు సార్లు సేవలందిస్తాయి. ఇదిలా ఉంటే, ప్రపంచంలోని కొన్ని దేశాలు వియట్ జెట్ ఎయిర్ 'బికినీ' ఎయిర్హోస్టెస్ల కాన్సెప్ట్ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సంప్రదాయక దేశమైన భారత్లోనూ అలాంటి అనుభవమే కంపెనీకి ఎదురుకావొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.