Padmaavat: రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ఏడో సినిమాగా 'పద్మావత్‌'

  • సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ‘పద్మావత్‌’
  • వివాదాల నడుమ విడుదలైన భన్సాలీ సినిమా
  • అంతకు ముందు ఈ క్లబ్‌లో బాహుబ‌లి-2, పీకే, భజరంగీ భాయిజాన్‌, సుల్తాన్‌, దంగల్‌, టైగర్‌ జిందా హై

దీపికా పదుకునే ప్ర‌ధాన పాత్ర‌లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ‘పద్మావత్‌’ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకుందని ట్రేడ్ అన‌లిస్ట్ తరణ్‌ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ఏడో సినిమా 'పద్మావత్‌'. ఈ సినిమా అనేక వివాదాల న‌డుమ చిక్కుకుని చివ‌ర‌కు ఈ ఏడాది జనవరి 25న విడులైన విష‌‌యం తెలిసిందే.

కాగా, ఇప్ప‌టివ‌ర‌కు హిందీ వ‌ర్ష‌న్ లో మూడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్లు సాధించి ఈ క్ల‌బ్ లో నిలిచిన ఇత‌ర‌ సినిమాల్లో బాహుబ‌లి-2, పీకే, భజరంగీ భాయిజాన్‌, సుల్తాన్‌, దంగల్‌, టైగర్‌ జిందా హై ఉన్నాయి. ఇందులో మూడు సినిమాలు సల్మాన్ వి కాగా, రెండు సినిమాలు ఆమిర్ ఖాన్ వే అయి ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా, హిందీ వర్షన్ లో రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఏకైక చిత్రం బాహుబలి మాత్రమేనని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 

More Telugu News