vennela koshore: తన బ్రేక్‌ ఫాస్ట్‌ ఇదేనంటూ ట్వీట్‌ చేసి.. నవ్వించిన హాస్యనటుడు వెన్నెల కిశోర్‌

  • 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు తింటా
  • ఆ వెంటనే కొంచెం పొంగల్‌, రెండు ఆనియన్‌ దోశలు లాగిస్తా
  • ఒక టీ మాత్రం స్నాక్స్‌ లా తీసుకుంటా

హాస్యనటుడు వెన్నెల కిశోర్ తాజాగా ట్విట్టర్‌లో ఫన్నీగా తన అల్పాహార విశేషాలను పోస్ట్ చేసి నవ్వించాడు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేసి అలరించాడు. తన బ్రేక్‌ ఫాస్ట్ ఇది మాత్రమేనని, 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు తిని, ఆ వెంటనే కొంచెం పొంగల్‌, రెండు ఆనియన్‌ దోశలు ఆనియన్లు లేకుండా తింటానని పేర్కొన్నాడు. అనంతరం ఒక టీ మాత్రం స్నాక్స్‌ లా తీసుకుంటాని నవ్వించాడు.

ఆయన చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను అలరిస్తోంది. ఈ ట్వీట్ పై మంచు లక్ష్మి కూడా స్పందించి తన జీవితంలో ప్రతిరోజు ఆనందానికి వెన్నెల కిశోర్‌ కూడా ఓ కారణమని అన్నాడు. వెన్నెల కిశోర్ టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించిన విషయం తెలిసిందే. 

More Telugu News