Chandrababu: చంద్రబాబు నిర్ణయం వెనుక సెంటిమెంట్లే బలంగా పని చేశాయి : రైల్వే మంత్రి పీయూష్ గోయల్

  • ఎన్డీఏతో తెగదెంపులు, టీడీపీ అవిశ్వాసంపై స్పందించిన గోయల్
  • వాస్తవాల కంటే సెంటిమెంట్లే బాగా పని చేసి ఉంటాయి
  • అమరావతి నిర్మాణానికి నిధులిచ్చినా పనులు చేయలేదు : గోయల్ విమర్శలు

ఎన్డీఏ నుంచి టీడీపీ తెగదెంపులు చేసుకోవడం, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. ‘రైజింగ్ ఇండియా సమ్మిట్’ లో గోయల్ మాట్లాడుతూ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వెనుక వాస్తవాల కంటే సెంటిమెంట్లే బాగా పని చేసి ఉంటాయని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని, అందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం రూ.2,500 కోట్లు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర అప్రభుత్వం ఏ పనులూ చేయలేదని కేంద్ర మంత్రి విమర్శించడం గమనార్హం. 

More Telugu News