jd chakravarthi: మళ్లీ హీరోగా వచ్చేస్తోన్న జేడీ చక్రవర్తి

  • 'అమ్మ' రాజశేఖర్ దర్శకత్వంలో 'ఉగ్రం'
  • హీరోగా జేడీ చక్రవర్తి రీ ఎంట్రీ 
  • త్వరలో పూర్తి వివరాలు  

'శివ' సినిమాతో వచ్చిన క్రేజ్ తో హీరోగా మారిపోయిన జేడీ చక్రవర్తి, ఆ తరువాత హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కొంతకాలం పాటు సక్సెస్ బాటలో నడిచిన ఆయన, ఆ తరువాత పరాజయాలను పలకరిస్తూ వెళ్లాడు. ఫలితంగా అవకాశాలు తగ్గడంతో, ఆ మధ్య దర్శకుడిగానూ మెగా ఫోన్ పట్టేసి కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అక్కడ కూడా ఆయనకి సక్సెస్ లు దక్కలేదు.

 దాంతో కొంతకాలంగా సైలెంట్ గా వున్న ఆయన, ఇప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. గతంలో 'రణం' వంటి హిట్ మూవీ చేసిన 'అమ్మ' రాజశేఖర్ .. 'ఉగ్రం' అనే సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా జేడీ చక్రవర్తి చేస్తున్నాడు. రీ ఎంట్రీలో ఆడియన్స్ ఆయనను ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.   

More Telugu News