vijaya sai reddy: పార్లమెంట్‌ భవనంపైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

  • పార్లమెంటు ఆవరణలో కొనసాగుతోన్న వైసీపీ ఎంపీల నిరసన
  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్
  • ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని నినదించిన విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్ర ప్ర‌భుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న విషయం తెలిసిందే. కాగా, ఆ పార్టీ ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేశారు. ఈ రోజు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ భవనం మొదటి అంతస్తు ఎక్కి, ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని నినదిస్తూ తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి  టీడీపీ మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఏపీ ప్రజల సమస్యలను కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆయన అన్నారు. 

More Telugu News