jayasudha: సాయంత్రం 6 దాటితే షూటింగ్ చేయనని చెప్పేసేదానిని: జయసుధ

  • హీరోయిన్ గా ఒక స్థాయికి వచ్చాను 
  • అప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నాను 
  • శోభన్ బాబుగారి ప్రభావం ఉంటే ఉండొచ్చు         

సావిత్రి .. వాణిశ్రీ తరువాత నటన పరంగా ఆ స్థాయి మార్కులు కొట్టేసిన కథానాయిక జయసుధ. ప్రేక్షకుల నుంచి ఆమెకి లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. అలాంటి జయసుధ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. అనేక విషయాలను పంచుకున్నారు.

 " ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మూడు నాలుగేళ్లలోనే నేను హీరోయిన్ గా సక్సెస్ అయ్యాను. నేను ఇంకా స్టార్ హీరోయిన్ ని కాకముందే .. సాయంత్రం 6 గంటల తరువాత పనిచేయకూడదని నిర్ణయించుకున్నాను. శోభన్ బాబుగారితో ఎక్కువగా సినిమాలు చేయడం వలన ఆ ప్రభావం కూడా నాపై ఉంటే ఉండొచ్చు. దాసరి నారాయణరావుగారు .. మా గురువుగారు .. ఒక స్టేజ్ వచ్చేసరికి, సాయంత్రం 6 తరువాత పనిచేయనని ఆయనతో కూడా చెప్పాను. ఆయన తిడతారని తెలుసు .. అయినా 6 దాటితే చేసేదానిని కాదు . . నాకు ఇష్టం లేదని చెప్పేసేదానిని" అని అన్నారు.      

More Telugu News