ramgopal varma: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను రాకేశ్ రెడ్డితో చెయ్యబోవటం లేదు: రామ్ గోపాల్ వర్మ ప్రకటన

  • వైఎస్సార్సీపీ నేత రాకేశ్ రెడ్డితో నాకు ఏవిధమైన సంబంధం లేదు
  • ఓ ఇంటర్వ్యూలో రాకేశ్ మాట్లాడిన లింక్ ను పోస్ట్ చేసిన దర్శకుడు
  • ఆ ఇంటర్వ్యూలో రాకేశ్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలే : వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వైసీపీకి చెందిన రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తు న్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై వర్మ తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నేను వైఎస్సార్సీపీకి చెందిన రాకేశ్ రెడ్డితో చెయ్యబోవటం లేదు’ అని తన పోస్ట్ లో వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ లింక్ ను పోస్ట్ చేసిన వర్మ, ఆ ఇంటర్వ్యూలో రాకేశ్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని అన్నారు. ‘ఈ అబద్ధాలు చెప్పడం వైఎస్సార్సీపీలోని పెద్దలని మోసం చెయ్యడానికా? లేదా ఇంకెవరినైనా మోసం చెయ్యడానికా అనేది వాడికే తెలియాలి. నాకు, తనకు ఏవిధమైన సంబంధం లేదని చెప్పడానికే ఈ నోట్ విడుదల చేస్తున్నాను’ అని ఆ పోస్ట్ లో వర్మ పేర్కొన్నారు.

More Telugu News