chaitu: 'సవ్యసాచి'పై భారీ అంచనాలు .. ఫస్టు పంచ్ రేపే

  • చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • కీలకమైన పాత్రలో భూమిక

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో భూమిక కనిపించనుంది. ఈ సినిమాలో మాధవన్ విలన్ గా చేస్తుండటం విశేషం.  చైతూ .. మాధవన్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు.

 ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఫస్టు పంచ్' పేరుతో రేపు ఉదయం (శుక్రవారం) 10 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది. 'ప్రేమమ్' హిట్ తరువాత చందూ .. చైతూ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో, అందరిలోనూ ఎంతో ఆసక్తి వుంది.    

More Telugu News