lecturer: అధ్యాపకుడిని తుపాకీతో కాల్చి హత్య చేసి పారిపోయిన విద్యార్థి

  • హర్యానాలోని సోనెపత్‌ జిల్లాలో ఘటన
  • షాహేబ్‌ దల్బీర్‌సింగ్ కాలేజీలో చదువుకుంటోన్న విద్యార్థి
  • స్టాఫ్ రూమ్‌లో ఉన్న తమ అధ్యాపకుడి వద్దకు వెళ్లి దారుణం

హర్యానాలోని సోనెపత్‌ జిల్లాలో ఓ కుర్రాడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. కాలేజీలో తమ అధ్యాపకుడిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. షాహేబ్‌ దల్బీర్‌సింగ్ కాలేజీలో చదువుకుంటోన్న ఓ విద్యార్థి.. స్టాఫ్ రూమ్‌లో ఉన్న తమ అధ్యాపకుడు రాజేశ్ మాలిక్‌ వద్దకు వెళ్లి తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడని వివరించారు.

దీంతో రాజేశ్‌ మాలిక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, ఆ విద్యార్థి ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయం తెలియాల్సి ఉందని  పోలీసులు తెలిపారు. 

More Telugu News