కేసీఆర్ బిడ్డ ఇప్పుడు లోక్ సభలో పోడియంలోనే ఉంది... ఆమెకో న్యాయం, మాకో న్యాయమా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పార్లమెంట్ లో టీఆర్ఎస్ నిరసన తెలపడం లేదా?
- అక్కడ ఎంపీలను సస్పెండ్ చేస్తే హర్షిస్తారా?
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్లమెంట్ లో ప్రతిపక్షం ఉండవచ్చుగానీ, రాష్ట్ర అసెంబ్లీలో ఉండరాదన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీని టీఆర్ఎస్ భవన్ కో, ప్రగతి భవన్ కో మార్చుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కౌన్సిల్ చైర్మన్ కు జరిగిన ఘటన బూటకమని, కేసీఆర్ ఆడిన నాటకమని ఆరోపించారు.