dhruv: తమిళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ గా గౌతమి కూతురు

  • తమిళంలోకి 'అర్జున్ రెడ్డి' రీమేక్
  •  దర్శకుడిగా బాలా  
  • హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్

తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో హీరోగా విక్రమ్ తనయుడు 'ధృవ్' నటిస్తున్నాడు. ఈ సినిమా యూనిట్ గెడ్డంతో వున్న  ధృవ్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేసింది. దాంతో కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ఈ నేపథ్యంలో గౌతమి కూతురు సుబ్బులక్ష్మి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గౌతమికి మొదటి భర్త వలన కలిగిన సంతానమే సుబ్బులక్ష్మి. కమలహాసన్ కి దూరమైన గౌతమి, కొంతకాలం నుంచి తన కూతురును కథానాయికగా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలోనే ధృవ్ జోడీగా సుబ్బులక్ష్మి పేరు వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Telugu News