Virat Kohli: ముంబైలో నెలకు రూ.15 లక్షల అద్దెతో కోహ్లీ దంపతుల కొత్త ఫ్లాట్

  • వోర్లీలోని రహేజా లెజండ్స్ అపార్ట్‌మెంట్‌లో కొత్త ఫ్లాట్‌కు అగ్రిమెంట్
  • ఇందులో రెండేళ్లు మాత్రమే ఉండేలా తాత్కాలిక ఏర్పాటు
  • ఫ్లాట్‌కు నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లింపు...!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట ముంబైలోని వోర్లీలో ఇటీవల అద్దె ప్రాతిపదికన ఓ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రేమజంట అందులోకి షిఫ్ట్ కానున్నట్లు సమాచారం. ఈ ఇల్లు తాత్కాలికమైన ఏర్పాటేనని, ఇందులో వారు రెండేళ్ల పాటు మాత్రమే ఉంటారని తెలిసింది. 'రహేజా లెజండ్స్' అపార్ట్‌మెంట్‌లోని 40వ అంతస్థులో ఓ ఫ్లాటును విరాట్ లీజుకు తీసుకున్న ఈ ఫ్లాటు విస్తీర్ణం 2675 చదరపు అడుగులు. ఈ ఫ్లాటుకు నెలకు అద్దె కింద కోహ్లీ జంట కళ్లుచెదిరిపోయే మొత్తాన్ని చెల్లించనున్నారు. నెలకు రూ.15 లక్షల అద్దెను వారు చెల్లించనున్నట్లు తెలిసింది.కోహ్లీ ఈ ఫ్లాట్‌కి డిపాజిట్ కింద రూ.1.5 కోట్లను, ఒప్పంద రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ కింద మరో రూ.1.01 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.

కాగా, అక్టోబరు, 2016లో వోర్లీలో 'ఓంకార్ 1973' అపార్ట్‌మెంట్‌లోని 35వ అంతస్థులో ఓ ఫ్లాట్‌ను విరాట్ రూ.34 కోట్లకు కొనుగోలు చేశాడు. దీని విస్తీర్ణం 7,171 చదరపు అడుగులు. ఇది 5-బీహెచ్‌కే లగ్జరీ హోమ్. మరో విశేషమేమిటంటే...ఇదే అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్థులో ఉన్న ఓ ఫ్లాట్‌ను క్రికెటర్ యువరాజ్ సింగ్-హజీల్ కీచ్ దంపతులు కొనుగోలు చేశారు. కాగా, డిసెంబరు 11, 2017న తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య విరాట్-అనుష్క జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

More Telugu News