మరో యువతితో 'ఎఫైర్' కాదన్నందుకు తల్లినే కడతేర్చిన టీనేజ్ గర్ల్...!
- మహిళా టీచర్తో జీవించేందుకు వద్దందని తల్లిని కర్ర, రాడ్తో కొట్టి చంపిన యువతి
- గతంలోనూ ఇంటి నుంచి పారిపోయిన వైనం
- తండ్రి ఫిర్యాదుతో నిందిత యువతి అరెస్టు
కాగా, తల్లిని చంపి పారిపోయిన సదరు యువతిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తండ్రి సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. టీచర్తో తమ కుమార్తె సంబంధం విషయమై తమ కుటుంబంలో చాలా రోజులుగా గొడవ జరుగుతోందని ఆయన చెప్పారు. మరోవైపు టీచర్పై కూడా కవి నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది సెప్టెంబరులో 35 ఏళ్ల టీచర్తో కలిసి జీవించేందుకు సదరు యువతి తొలుత ఇల్లు విడిచి పారిపోయింది. అయితే మైనర్ కావడంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచకపోతే ఇలాంటి చిత్రమైన పరిస్థితులే ఎదురవుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.