vamshi paidypalli: 'ఇందులో నిజం లేదు.. తప్పుడు వార్తలు'.. మహేశ్‌ బాబుతో తన కొత్త సినిమా కాపీ వార్తలపై వంశీ పైడిపల్లి స్పందన

  • ఆ సినిమా కథను ఓ ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారంటూ వార్తలు
  • ట్విట్టర్‌లో స్పష్టతనిచ్చిన దర్శకుడు
  • తన కొత్త సినిమా ఏ సిరీస్‌, సినిమా స్ఫూర్తితోనూ తీయడం లేదన్న వంశీ పైడిపల్లి

దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు త్వరలోనే ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా కథను ఓ ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారని వస్తోన్న వార్తలను వంశీ పైడిపల్లి ఖండించారు. ఇందులో నిజం లేదని, అవి తప్పుడు వార్తలని, తన కొత్త సినిమా ఏ సిరీస్‌, సినిమా స్ఫూర్తితోనూ తీయడం లేదని స్పష్టతనిచ్చారు.

తాను తీస్తోన్న మహేశ్‌ 25వ సినిమా కథను ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారంటూ న్యూజిలాండ్‌ రచయిత ఒకరు ఈ వార్త రాశారంటూ ఓ అభిమాని వంశీ పైడిపల్లికి ట్వీట్‌ చేయడంతో సదరు దర్శకుడు ఇలా స్పందించారు. కాగా మహేశ్‌ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించనున్నారు. 

More Telugu News