nikhil: రిపోర్టర్ గా కనిపించనున్న నిఖిల్

  • తమిళంలో హిట్ కొట్టిన 'కనితన్'
  • తెలుగు రీమేక్ లో నిఖిల్
  •  త్వరలోనే పూర్తి వివరాలు

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ .. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ నిఖిల్ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన రెండు రీమేక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. వాటిలో ఒకటి 'కిరాక్ పార్టీ' పేరుతో రానుంది. కన్నడలో ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. తెలుగులోకి రీమేక్ చేయబడిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఆ వెంటనే నిఖిల్ .. తమిళంలో సక్సెస్ ను సాధించిన 'కనితన్' రీమేక్ లో చేస్తున్నాడు. 'కిరాక్ పార్టీ'లో స్టూడెంట్ లీడర్ గా నటించిన ఆయన, ఈ సినిమాలో రిపోర్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాకి , సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే హీరోయిన్ తో పాటు మిగతా నటీనటుల పేర్లను వెల్లడించనున్నారు.      

More Telugu News