nagachaitanya: చైతూ .. సమంత జోడీకి భారీ పారితోషికం!

  • 'నిన్నుకోరి' దర్శకుడితో చైతూ 
  • కథానాయికగా సమంత ఖరారు 
  • ఆడియన్స్ లో ఈ జంటను చూడాలనే ఆసక్తి         

ప్రస్తుతం నాగచైతన్య .. సమంత ఇద్దరూ కూడా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ముందుగా ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పిన చైతూ .. ఆ తరువాత ఈ సినిమా చేస్తున్నట్టుగా చెప్పాడు. అందుకు కారణం పారితోషికమేననే టాక్ వినిస్తోంది.

 సాధారణంగా ఒక సినిమాకి  చైతూ 3 కోట్లకి పైగా తీసుకుంటాడు. ఇక సమంత ఒకటిన్నర వరకూ తీసుకుంటుంది. అయితే వివాహం తరువాత చైతూ .. సమంతల కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ క్రేజ్ కి తగినట్టుగా ఇద్దరికీ కలిపి 7 కోట్ల వరకూ పారితోషికం ఇవ్వమని చైతూ అడిగినట్టుగా టాక్. నిర్మాతలు కొన్ని రోజుల పాటు ఆలోచన చేసినా, చివరికి అందుకు అంగీకరించారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.        

  • Loading...

More Telugu News