mahesh bhatt: అప్పట్లో తీవ్రమైన జ్వరంతోను శ్రీదేవి షూటింగులో పాల్గొంది: మహేశ్ భట్

  • నీళ్లలో ఎక్కువసేపు వుండే సీన్ చేయాలి 
  • శ్రీదేవికి జ్వరంగా ఉండటంతో వద్దన్నాను 
  • అయినా ఆమె ధైర్యంగా చేసేసింది  

శ్రీదేవి మరణం ఆమె అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. ఆమెతో సినిమాలు చేసిన దర్శకులు ఆమె అంకితభావాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో మహేశ్ భట్ మాట్లాడుతూ .. " శ్రీదేవి కథానాయికగా నేను 'గుమ్రా' సినిమా చేస్తున్నాను. ఆమె నీటిలో వుండే ఒక సన్నివేశాన్ని చిత్రీకరించవలసి వుంది. అయితే ఆ సమయంలో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది.

 నీటిలో ఎక్కువ సేపు వుంటే ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని భావించి, షూటింగును వాయిదా వేస్తున్నట్టుగా ఆమెతో చెప్పాను. తన వలన షూటింగును పోస్ట్ పోన్ చేయడానికి ఆమె అంగీకరించలేదు. అంత జ్వరంలోను చాలాసేపు నీటిలో తడుస్తూనే షూటింగులో పాల్గొంది. ఆమెకి గల అంకితభావం అందరికీ ఆదర్శప్రాయం" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News