Khammam District: నిన్న రాత్రి పెళ్లి... ఈ తెల్లవారుజామున వరుడు సహా ఐదుగురి మృతి... ఖమ్మం సమీపంలో ఘోర ప్రమాదం!

  • తణుకులో గత రాత్రి ఘనంగా వివాహం
  • ఆపై వర్థన్నపేటకు బయలుదేరిన కుటుంబం
  • పల్లిపాడు వద్ద చెట్టును ఢీకొన్న ఇన్నోవా
  • వరుడు మృతి, వధువుకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాళ్ల పారాణి తడి కూడా ఆరకముందే నవ వధువు భర్తను కోల్పోయి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తణుకులో నిన్న రాత్రి ఓ వివాహం జరుగగా, ఆపై వధువు, వరుడు సహా ఎనిమిది మంది ఓ ఇన్నోవాలో స్వగ్రామానికి బయలుదేరారు.

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు వీరి వాహనం వస్తుండగా, పల్లిపాడు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో వాహనం వేగం చాలా అధికంగా ఉండటంతో ప్రమాద తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంది. ఈ ఘటనలో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వధువు సహా గాయపడిన మరో ఇద్దరిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పెళ్లింట విషాధ ఛాయలు అలముకున్నాయి.

More Telugu News